సర్కారు కళ్లు మూసుకొందా?
ABN , First Publish Date - 2020-05-30T07:51:23+05:30 IST
ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో తన బిడ్డకు ప్రాణహాని ఉందని, వెంటనే అక్కడి నుంచి బయటకు పంపించాలని ..
![సర్కారు కళ్లు మూసుకొందా?](https://media.andhrajyothy.com/appimg/galleries/202005300160/05302020022032n41.jpg)
సుధాకర్పై ఇంత జరుగుతున్నా స్పందించదేం?
నా బిడ్డను బయటకు పంపండి: తల్లి డిమాండ్
విశాఖపట్నం, మే 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో తన బిడ్డకు ప్రాణహాని ఉందని, వెంటనే అక్కడి నుంచి బయటకు పంపించాలని డాక్టర్ సుధాకర్ తల్లి కావేరిబాయి డిమాండ్ చేశారు. ఆమె శుక్రవారం మధ్యాహ్నం విశాఖలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడున్న ఆస్పత్రిలో సుధాకర్ను ఉంచడానికి ఒప్పుకోబోమని మరో ఆస్పత్రికి తరలించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకుండా, కళ్లు మూసుకొని కూర్చోవడం దారుణమని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.