పోలీసులకు వీక్లీ ఆఫ్ను ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఏపీ: సుచరిత
ABN , First Publish Date - 2020-10-21T14:47:34+05:30 IST
విజయవాడ: ప్రతీ సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినం జరుపుకుంటున్నామని
విజయవాడ: ప్రతీ సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినం జరుపుకుంటున్నామని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. సమాజంలోని అసమానతలు ఎదుర్కొంటున్న మహిళలు, బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. మహిళా మిత్ర, దిశ వంటివి తీసుకొచ్చామన్నారు. 18 దిశ పోలీసు స్టేషన్లు ఉన్నాయని సుచరిత తెలిపారు. సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోవడానికి బాలికలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. పోలీసు సేవా యాప్ కూడా తీసుకొచ్చామన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ను ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఏపీ అన్నారు. మహిళా సిబ్బందిని ప్రోత్సహించి మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కోవిడ్ను ఎదుర్కోవడంలో ప్రధాన పాత్ర పోషించి అమరులైన పోలీసులకు 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించామని సుచరిత తెలిపారు.