ఏపీలో రోడ్డునపడ్డ కల్లుగీత కార్మికులు
ABN , First Publish Date - 2020-03-30T16:07:58+05:30 IST
రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా కల్లుగీత కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని..
![ఏపీలో రోడ్డునపడ్డ కల్లుగీత కార్మికులు](https://media.andhrajyothy.com/appimg/galleries/2020033010325057/03302020103743n9.jpg)
అమరావతి: రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా కల్లుగీత కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గీత కార్మికులు ఉపాధిలేక రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ రాష్ట్రం తరహాలో ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి కార్మికులను ఆదుకోవాలని సత్యప్రసాద్ కోరారు.