అమరావతి రైతులపై రాళ్ల దాడి చేసిందెవరు?.. చేయించిందెవరు?
ABN , First Publish Date - 2020-12-08T00:52:45+05:30 IST
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు 356 రోజులగా దీక్ష చేస్తున్నారు. అయితే ఈ దీక్షా శిబిరంపై..

అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు 356 రోజులగా దీక్ష చేస్తున్నారు. అయితే ఈ దీక్షా శిబిరంపై రాళ్ల దాడి జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. అయితే ఈ దాడి కావాలని చేశారని రాజధాని రైతులు అంటున్నారు. ఏపీ రాజధానిలో ఇలాంటి పరిస్థితులు జరుగుతున్న నేపథ్యంలో ‘‘అమరావతి దీక్షా శిబిరంపై రాళ్ల దాడి ఏంటి?. రైతులపై రాళ్ల దాడి చేసిందెవరు..? చేయించిందెవరు..?. ఒక ఉద్యమంపై మరో ఉద్యమం పేరుతో దాడి ఉద్దేశం ఏమిటి?. పాలకపక్షం ఫ్రస్టేషనా.. కుతంత్రం కూలిపోతుందనే భయమా?. పోటీ ఉద్యమానికి పోలీసులు ఎలా అనుమతిస్తున్నారు..?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.