రాష్ట్ర ప్రగతి, ప్రజల ఆదాయంలో పెరుగుదల సున్నా: చంద్రబాబు
ABN , First Publish Date - 2020-06-05T00:25:32+05:30 IST
రాష్ట్ర ప్రగతి, ప్రజల ఆదాయంలో పెరుగుదల సున్నా.. ఉన్న నిర్మాణాలకు రంగులు వేసి ప్రభుత్వ ఖజానాకు సున్నం వేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.
![రాష్ట్ర ప్రగతి, ప్రజల ఆదాయంలో పెరుగుదల సున్నా: చంద్రబాబు](https://media.andhrajyothy.com/appimg/galleries/20200604031961/06042020185519n21.jpg)
హైదరాబాద్: రాష్ట్ర ప్రగతి, ప్రజల ఆదాయంలో పెరుగుదల సున్నా.. ఉన్న నిర్మాణాలకు రంగులు వేసి ప్రభుత్వ ఖజానాకు సున్నం వేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రానికి ఉపయోగపడని ‘‘జీరో సీఎం’’ పేరుతో చంద్రబాబు ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది కాలంలో ఏపీకి వచ్చిన పరిశ్రమలు, ఉద్యోగాలు రాలేదని చెప్పారు. టీడీపీ హయాంలో వ్యవస్థలను చక్కదిద్ది.. అభివృద్ధిని పరుగులు పెట్టించామని తెలిపారు. ఏడాదిలోనే వ్యవస్థలను గాడి తప్పించారని, స్వార్థం కోసం అభివృద్ధిని నిలిపివేశారని, పోలవరం, అమరావతిలో పనుల నిలిపివేతనే నిదర్శనమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.