విశాఖలో త్వరలో డిజిటల్‌ సదస్సు: గౌతమ్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-09-12T09:44:13+05:30 IST

త్వరలోనే విశాఖపట్నం వేదికగా ‘డిజిటల్‌ సదస్సు’ ఏర్పాటు చేయడానికి నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ హామీ ఇచ్చారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

విశాఖలో త్వరలో డిజిటల్‌ సదస్సు: గౌతమ్‌రెడ్డి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): త్వరలోనే విశాఖపట్నం వేదికగా ‘డిజిటల్‌ సదస్సు’ ఏర్పాటు చేయడానికి నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ హామీ ఇచ్చారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. ఇక్కడి నీతిఆయోగ్‌ కార్యాలయంలో సీఈవో అబితాబ్‌కాంత్‌తో శుక్రవారం ఆయన భేటీ అయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వచ్చే అక్టోబరు నుంచి ఎప్పుడైనా ఈ సదస్సు నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు నీతిఆయోగ్‌ సీఈవో చెప్పారన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని అమితాబ్‌కాంత్‌ భరోసా ఇచ్చారన్నారు. సీఎం జగన్‌ సాహసోపేత నిర్ణయాలు, ప్రభుత్వ పాలన, కీలకమైన సంస్కరణలను వివరించినప్పుడు ఆయన మెచ్చుకున్నారన్నారు.

Updated Date - 2020-09-12T09:44:13+05:30 IST