వీడని స్టైరిన్‌ ముప్పు

ABN , First Publish Date - 2020-05-13T09:41:29+05:30 IST

ఎల్జీ పాలిమర్స్‌ నుంచి వెలువడిన విషవాయువు స్టైరిన్‌ ముప్పు ఇంకా తొలగినట్టు కనిపించడంలేదు.

వీడని స్టైరిన్‌ ముప్పు

సొమ్మసిల్లిన ఇద్దరు వలంటీర్లు

ఇళ్ల నుంచి ఘాటైన వాసన


గోపాలపట్నం(విశాఖపట్నం), మే 12: ఎల్జీ పాలిమర్స్‌ నుంచి వెలువడిన విషవాయువు స్టైరిన్‌ ముప్పు ఇంకా తొలగినట్టు కనిపించడంలేదు. వెంకటాపురం గ్రామస్థులు ఇళ్లకు తిరిగి వచ్చి తలుపులు తీయగానే ఘాటైన వాసన వస్తోంది. మంగళవారం బాధితుల వివరాల సేకరణకు వచ్చిన వలంటీర్లు కుసుమ, నూకరత్నం ఆ వాసనకు సొమ్మసిల్ల్లి పడిపోయారు. సమీప గ్రామ సచివాలయం వద్ద ఉన్న ఆశ వర్కర్లు వెంటనే అక్కడికి వచ్చి వారికి సపర్యలు చేశారు. అనంతరం గోపాలపట్నం ఆస్పత్రికి తరలించారు. వీరిని ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆశ కార్యకర్త  కనకమహాలక్ష్మి విషవాయువు ప్రభావంతో ఆస్పత్రిలోనే కుప్పకూలిపోయారు. 

Updated Date - 2020-05-13T09:41:29+05:30 IST