పోలవరం పునరావాసంపై రేపు ప్రత్యేక భేటీ!
ABN , First Publish Date - 2020-12-29T08:50:43+05:30 IST
భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల కోసం నిధుల అవసరాన్ని వివరిస్తూ నివేదికను సమర్పించాలని కోరినా రాష్ట్రప్రభుత్వం పట్టించుకోకపోవడంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆగ్రహంతో ఉంది.
అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల కోసం నిధుల అవసరాన్ని వివరిస్తూ నివేదికను సమర్పించాలని కోరినా రాష్ట్రప్రభుత్వం పట్టించుకోకపోవడంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం (30వ తేదీన) రాష్ట్ర జలవనరుల శాఖతో విజయవాడలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ హాజరు కానున్నారు. ఆనాటికి భూసేకరణ, పునరావాస కార్యక్రమాల పూర్తి సమాచారం అందించాలని జలవనరుల శాఖను పీపీఏ ఆదేశించింది.