పైపులైన్ల లీకేజీలపై పురపాలకశాఖ ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2020-12-11T07:33:19+05:30 IST

రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, డైనేజీ పైపులైన్లన్నీ ఎలాంటి లీకుల్లేకుండా ఉండేలా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని

పైపులైన్ల లీకేజీలపై పురపాలకశాఖ ప్రత్యేక దృష్టి

అమరావతి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, డైనేజీ పైపులైన్లన్నీ ఎలాంటి లీకుల్లేకుండా ఉండేలా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ పట్టణ స్థానిక సంస్థలను ఆదేశించింది. పశ్చిమ గోదావరి జిల్లా  ఏలూరులో వింత వ్యాధి ఘటన దృష్ట్యా ప్రభుత్వం ఈ చర్యలకు తీసుకుంది. ఇప్పటికే ఒకరు మరణించడంతోపాటు.. వందలాది మంది బాధితులు ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే.


దీనికి కారణాలేమిటన్నది ఇంకా నిర్ధారణ కానప్పటికీ.. కలుషిత నీరు, ప్రమాదకర రసాయనిక అవశేషాలు కలిగిన కూరగాయలు లేదా పాల వల్ల వింతవ్యాధి ప్రబలిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పురపాలక శాఖ ఆదేశాల మేరకు తాగునీరు, డ్రైనేజీ పైపులైన్లను తనిఖీలు చేసి, లీకేజీలుంటే అరికట్టి, మార్చాల్సి ఉంటే మార్చేందుకు పట్టణ సంస్థలు సమాయత్తమవుతున్నాయి.

Updated Date - 2020-12-11T07:33:19+05:30 IST