భౌతిక దూరమా.. ఏదీ.. ఎక్కడా?
ABN , First Publish Date - 2020-04-05T08:35:48+05:30 IST
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో శనివారం కనిపించిందీ దృశ్యం. కరోనా నేపథ్యంలో ప్రజలు భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు మొ త్తుకుంటున్నా.. తాత్కాలిక ఏఎన్ఎం పోస్టుల భర్తీకి అధికారులు ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసి..
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో శనివారం కనిపించిందీ దృశ్యం. కరోనా నేపథ్యంలో ప్రజలు భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు మొ త్తుకుంటున్నా.. తాత్కాలిక ఏఎన్ఎం పోస్టుల భర్తీకి అధికారులు ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసి.. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. ఆ ప్రాంగణంలో నిరుద్యోగులు గుంపులుగుంపులుగా కనిపించడంపై విమర్శలు వినిపించాయి. అలాగే, ప్రభుత్వం పేదలకు ఇస్తున్న రూ.1000 పంపిణీ తదితర కార్యక్రమాల్లో పలుచోట్ల కీలక ప్రజాప్రతినిధులు, ఆధికార పార్టీ నేతలు కార్యర్తలతో గుంపులు గుంపులుగా పాల్గొనడం కనిపించింది. వై.పాలెంలో మంత్రి సురేశ్, ముండ్లమూరులో మండలం వేములలో దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్, అద్దంకి సెగ్మెట్లో ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి కృష్ణచైతన్య, అలాగే పలుచోట్ల అధికారపార్టీ నేతలు, కార్యకర్తల గుంపులుగా పర్యటించడంపై విమర్శలొచ్చాయి.