కావలి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్‌లో పాము హల్ చల్

ABN , First Publish Date - 2020-06-23T16:54:23+05:30 IST

కావలి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్‌లో కట్ల పాము ఆకస్మాత్తుగా జనాల్లోకి వచ్చింది.

కావలి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్‌లో పాము హల్ చల్

నెల్లూరు జిల్లా: కావలి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్‌లో కట్ల పాము ఆకస్మాత్తుగా జనాల్లోకి వచ్చి హల్ చల్ చేసింది. టీలు తాగుతూ పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్న జనమంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. విష సర్పం కావడంతో కొందరు దూరంగా వెళ్లిపోయారు. ఆ తర్వాత కొందరు పామును చంపేశారు. అప్పటి వరకు రాజకీయాలు, కరోనా కేసుల గురించి మాట్లాడుకుంటున్నవారంతా పాము గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు.

Updated Date - 2020-06-23T16:54:23+05:30 IST