న్యాయం కోసం వెళ్తే యువతిపై బెల్ట్‌తో ఎస్ఐ దాడి

ABN , First Publish Date - 2020-12-06T20:15:15+05:30 IST

న్యాయం చేయమని వేడుకునేందుకు వెళ్లిన బాధితురాలిపై ఎస్ఐ దాడికి పాల్పడ్డాడు.

న్యాయం కోసం వెళ్తే యువతిపై బెల్ట్‌తో ఎస్ఐ దాడి

తిరుపతి: న్యాయం చేయమని వేడుకునేందుకు వెళ్లిన బాధితురాలిపై ఎస్ఐ దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తిరుపతి ఎమ్మార్ పల్లె పోలీస్ స్టేషన్‌లో జరిగింది. ఉప్పర్‌పల్లికి చెందిన అక్కాచెల్లెళ్లు వనిత వాణి, శకుంతల ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకుంటున్నారు. అయితే పశువులు వచ్చి వాటిని తిని ధ్వంసం చేశాయి. వాటిని అక్కా చెల్లెళ్లు బంధించారు. విషయం తెలుసుకున్న పశువుల యజమానులు అక్కడికి చేరుకుని అక్కాచెల్లెళ్లను దుర్బాషలాడారు. ఇంట్లో వస్తువులు ధ్వంసం చేశారు. వెంటనే బాధితులు 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. అయితే రక్షక్ సిబ్బంది సంఘటనా స్థాలానికి చేరుకునే సరికి దాడి చేసిన వ్యక్తులు పరారయ్యారు. ఈ ఘటనపై పీఎస్‌లో ఫిర్యాదు చేయాలని రక్షక్ సిబ్బంది సూచించారు. వారు  ఎమ్మార్‌పల్లె పీఎస్‌కు వెళ్లి ఎస్ఐ ప్రకాష్ కుమార్‌కు విషయం చెబుతుండగా దుర్బాషలాడి బెల్ట్‌తో దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీస్ స్టేషన్ ఎదుట బైటాయించారు.

Updated Date - 2020-12-06T20:15:15+05:30 IST