ఏపీలో రెండే కుటుంబాలు రాజ్యమేలాలా?: విష్ణువర్ధన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-12-27T00:40:30+05:30 IST

ఏపీలో రెండే కుటుంబాలు రాజ్యమేలాలని చూస్తున్నాయని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

ఏపీలో రెండే కుటుంబాలు రాజ్యమేలాలా?: విష్ణువర్ధన్‌రెడ్డి

నెల్లూరు: ఏపీలో రెండే కుటుంబాలు రాజ్యమేలాలని చూస్తున్నాయని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారా లేకుంటే వైఎస్ కుటుంబాలే రాజ్యమేలాలా అని ప్రశ్నించారు.నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీలు తొలగించే ధైర్యం వైసీపీకి ఉందా అని మండిపడ్డారు. వైసీపీని ఎదురించే సత్తా బీజేపీకి ఉందని పేర్కొన్నారు. వైసీపీ, టీడీపీ నేతలు ఆలయాల్లో ప్రమాణాలు చేస్తే ప్రజలు నమ్మరని విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు.


నెల్లూరులో  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పర్యటన సందర్భంగా మినీ బైపాస్‌లో బీజేపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.అయితే ఫ్లెక్సీలను నగరపాలకసంస్థ అధికారులు తొలగించారు. ఈ విషయంపై బీజేపీ నేతలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అధికారులు, బీజేపీ నాయకులకు మధ్య ఘర్షణ జరిగింది. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. అధికారపార్టీ నేతల ఫ్లెక్సీలకు లేని అభ్యంతరం తమ పార్టీ ఫ్లెక్సీలపై ఎందుకని ప్రశ్నించారు. అయితే నగరంలో ఫ్లెక్సీల తొలగింపు విషయం చర్చనీయాంశమైంది.

Updated Date - 2020-12-27T00:40:30+05:30 IST