నిత్యావసరాలకు కొరత రానీయొద్దు: రాజీవ్ గౌబ
ABN , First Publish Date - 2020-03-25T09:25:32+05:30 IST
లాక్డౌన్ కాలంలో నిత్యావసరాలకు కొరత రానీయకుండా చూడాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఆదేశించారు. కరోనా వైర్సపై ఢిల్లీ నుంచి...
అమరావతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): లాక్డౌన్ కాలంలో నిత్యావసరాలకు కొరత రానీయకుండా చూడాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఆదేశించారు. కరోనా వైర్సపై ఢిల్లీ నుంచి మంగళవారం ఆయన వివిధ రాష్ట్రాల ప్రభుత్వ సీఎస్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి మరో 21 రోజుల వరకు లాక్డౌన్ ను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.