జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి భారీ షాక్

ABN , First Publish Date - 2020-12-01T15:32:52+05:30 IST

తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి మరో షాక్ తగిలింది.

జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి భారీ షాక్

అనంతపురం: తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి భారీ షాక్ తగిలింది. ఏపీ మైనింగ్ అధికారులు రూ.100 కోట్ల జరిమానా విధించారు. వంద కోట్లు కట్టకపోతే ఆర్ అండ్ ఆర్ చట్టం కింద ఆస్తులు జప్తు చేస్తామన్నారు. త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో జేసీ కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. యాడికి మండలం కోనఉప్పలపాడులో అక్రమ తవ్వకాలు జరిపి 14 లక్షల మెట్రిక్ టన్నుల దోపిడీ జరిగిందని, విలువైన లైమ్ స్టోన్‌ను తవ్వి విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారులు ఈ మేరకు జరిమానా విధించారు.

Updated Date - 2020-12-01T15:32:52+05:30 IST