రాజ్యాంగ దినోత్సవం రోజున అంబేద్కర్కు అవమానం
ABN , First Publish Date - 2020-11-26T22:37:42+05:30 IST
రాజ్యాంగ దినోత్సవం రోజున అంబేద్కర్కు అవమానం జరిగింది

అనంతపురం: రాజ్యాంగ దినోత్సవం రోజున అంబేద్కర్కు అవమానం జరిగింది. శింగనమల మండలం తరిమెలలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు అడ్డంకులు ఎదురయ్యాయి. విగ్రహ ఏర్పాటును గ్రామానికి చెందిన అగ్ర కులాలు అడ్డుకున్నాయి. విగ్రహం ఏర్పాటుకు తీసిన గొయ్యిలో దళితులు.. అంబేద్కర్ విగ్రహాన్ని ఉంచారు. విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.