ఏపీలో అడుగుపెట్టిన సచివాలయ ఉద్యోగులు
ABN , First Publish Date - 2020-05-27T21:48:57+05:30 IST
లాక్ డౌన్ కారణంగా 65 రోజుల తర్వాత సచివాలయం ఉద్యోగులు ఏపీలో అడుగుపెట్టారు.
గుంటూరు జిల్లా: లాక్ డౌన్ కారణంగా 65 రోజుల తర్వాత సచివాలయం ఉద్యోగులు ఏపీలో అడుగుపెట్టారు. లాక్ డౌన్తో హైదరాబాద్లోనే ఉండిపోయిన ఉద్యోగులకు ఆంక్షల వెసులుబాటు కల్పించడంతో .. ప్రభుత్వ ఉద్యోగులందరూ విధులకు హాజరు కావాలనే సీఎస్ ఆదేశాలతో బుధవారం హైదరాబాద్ నుంచి 250 మంది 10 బస్సుల్లో బయలుదేరి మంగళగిరి సీకే కన్వెన్షన్ హాలుకు చేరుకున్నారు. ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉద్యోగులు ఏపీ నుంచి మార్చి 21న హైదరాబాద్కు వెళ్లారు. ఆ తర్వాత అకస్మాత్గా లాక్ డౌన్ అమలుకావడంతో ఉద్యోగులు హైదరాబాద్లోనే తమ నివాసాల్లో ఉండిపోయారు.