మద్యం బదులు శానిటైజర్‌ తాగి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-04-28T10:24:35+05:30 IST

శానిటైజర్‌ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువకుడి ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.

మద్యం బదులు శానిటైజర్‌ తాగి వ్యక్తి మృతి

పెందుర్తి, ఏప్రిల్‌ 27: శానిటైజర్‌ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువకుడి ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. పెందుర్తిలోని సాయి మెస్‌లో ఏడాదిన్నర నుంచి రవి (40) వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. మద్యం అలవాటు ఉన్న రవి... లాక్‌డౌన్‌ కారణంగా అది అందుబాటులో లేకపోవడంతో శానిటైజర్లు తాగుతున్నాడు. ఆదివారం శానిటైజర్‌ తాగి పడుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున గుండెల్లో నొప్పి రావడంతో కేజీహెచ్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. 

Updated Date - 2020-04-28T10:24:35+05:30 IST