‘సంగం’ స్వయం ప్రతిపత్తికి ఎంతకైనా పోరాడతాం
ABN , First Publish Date - 2020-12-13T09:21:59+05:30 IST
‘సంగం’ స్వయం ప్రతిపత్తికి ఎంతకైనా పోరాడతాం

విజిలెన్స్ నోటీసులు... హైకోర్టు స్టే: ధూళిపాళ్ల
గుంటూరు, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): ‘‘సంగం డెయిరీ నిబద్ధతో పనిచేస్తోంది. డెయిరీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ‘సంగం’కి విజిలెన్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. 60 అంశాలకుపైగా సమాచారం కావాలని అడిగారు. నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చింది’’అని ఆ డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అన్నారు. గుంటూరులో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. డెయిరీ టర్నోవర్ రూ.4 కోట్ల నుంచి రూ.913 కోట్లకు చేరిందన్నారు. డెయిరీకి సంబంధించి రూ.160 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వం అమూ ల్ను తీసుకొచ్చి స్థానిక డెయిరీలను దెబ్బతీయాలని యత్నిస్తోందని విమర్శించారు.