లాక్డౌన్లోనూ మట్టి దందా.. వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల ఇష్టారాజ్యం
ABN , First Publish Date - 2020-04-15T01:51:01+05:30 IST
తాడిపత్రి నియోజకవర్గంలో మట్టి దందాను రైతులు అడ్డుకున్నారు. అయితే లారీలను అడ్డుకున్న ...
![లాక్డౌన్లోనూ మట్టి దందా.. వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల ఇష్టారాజ్యం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020041408172293/04142020201928n92.jpg)
అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో మట్టి దందాను రైతులు అడ్డుకున్నారు. అయితే లారీలను అడ్డుకున్న రైతులను తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు అంతుచూస్తామంటూ బెదిరించారు. లాక్ డౌన్ నిబంధనలు అధికార పార్టీ నేతలు ఉల్లంఘించినా.. మట్టి అక్రమంగా దందా చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.