ఆరంభమైన ఆర్టీసీ ఆన్లైన్ బుకింగ్
ABN , First Publish Date - 2020-04-08T09:40:56+05:30 IST
మార్చి 22 నుంచి డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు రోడ్డు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నాయి.

అమరావతి, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): మార్చి 22 నుంచి డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు రోడ్డు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నాయి. కేంద్రం నుంచి వస్తున్న సంకేతాలతో పీటీడీ అధికారులు ఆన్లైన్ టికెట్ బుకింగ్ తెరిచారు. ఈ నెల 15 నుంచి బస్సులు అందుబాటులో ఉంచడంతో ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేస్తున్నారు. సోమవారం నుంచి ఆన్లైన్ బుకింగ్ ప్రారంభమైంది.