చెట్టును ఢీకొట్టిన కారు

ABN , First Publish Date - 2020-12-05T22:54:52+05:30 IST

చెట్టును ఢీకొట్టిన కారు

చెట్టును ఢీకొట్టిన కారు

చిత్తూరు: జిల్లాలోని ములకలచెరువు మండలం తుమ్మనకుంట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన చెట్టును కారు ఢీకొన్న ప్రమాదంలో అనంతపురం పట్టణానికి చెందిన ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మదనపల్లె జిల్లా వైద్యశాలలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 


Updated Date - 2020-12-05T22:54:52+05:30 IST