లారీని ఢీకొట్టిన బైక్.. ముగ్గురు మృతి
ABN , First Publish Date - 2020-09-05T19:33:28+05:30 IST
లారీని ఢీకొట్టిన బైక్.. ముగ్గురు మృతి
![లారీని ఢీకొట్టిన బైక్.. ముగ్గురు మృతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చిత్తూరు: జిల్లాలోని కేవీపల్లి మండలం గ్యారంపల్లెలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతులు చిన్నగొట్టిగల్లుకు చెందిన శంకర్(38), హారిక(35), లల్లి(5)గా గుర్తించారు. పీలేరు నుంచి రాయచోటి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.