విద్యార్థులకు బియ్యం, చిక్కీ, గుడ్లు పంపిణీ

ABN , First Publish Date - 2020-03-24T09:52:12+05:30 IST

మధ్యాహ్న భోజన పథకం అమల్లో భాగంగా విద్యార్థులకు బియ్యం, చిక్కీ, గుడ్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది...

విద్యార్థులకు బియ్యం, చిక్కీ, గుడ్లు పంపిణీ

అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజన పథకం అమల్లో భాగంగా విద్యార్థులకు బియ్యం, చిక్కీ, గుడ్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో ఈ నెల 19 నుంచి 31 వరకు పాఠశాలలు మూసివేసిన దృష్ట్యా గ్రామ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల ద్వారా వీటి పంపిణీకి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కిలో బియ్యం, 4 చిక్కీలు, 8 గుడ్లు ఇస్తారు.ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కిలోన్నర బియ్యం, 4 చిక్కీలు, 8 గుడ్లు ఇస్తారు. 


Updated Date - 2020-03-24T09:52:12+05:30 IST