రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ వీడియో సందేశం
ABN , First Publish Date - 2020-04-04T22:49:52+05:30 IST
మర్కజ్ ఘటనకు మతం ముద్ర వేయడం సరికాదని, కరోనా కాటుకు కుల, మత బేదాలు లేవని సీఎం జగన్ చెప్పారు. కరోనా సృష్టిస్తున్న విపత్కర పరిస్థితిలో సీఎం ఏపీ ప్రజలకు వీడియో సందేశాన్ని ఇచ్చారు.
అమరావతి: మర్కజ్ ఘటనకు మతం ముద్ర వేయడం సరికాదని, కరోనా కాటుకు కుల, మత బేదాలు లేవని సీఎం జగన్ చెప్పారు. కరోనా సృష్టిస్తున్న విపత్కర పరిస్థితిలో సీఎం ఏపీ ప్రజలకు వీడియో సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కరోనా కట్టడికి పలు సూచనలు చేశారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని చెప్పారు.
ప్రజలు లాక్డౌన్ నిబంధనల్ని అతిక్రమించవద్దని ఆయన సూచించారు. సామాజికదూరం పాటిస్తూ కరోనాను తరిమేద్దామని జగన్ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం 9 నిమిషాలు లైట్లు ఆపుదామన్నారు. మనమంతా ఒక్కటే అన్న సత్యాన్ని చాటుదామని, వైద్య, పోలీస్, పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి వేతనాలు అందిస్తామని జగన్ ప్రకటించారు.