ఇన్పుట్ సబ్సిడీ విడుదల
ABN , First Publish Date - 2020-10-27T09:35:15+05:30 IST
ఇటీవలి వర్షాల వల్ల పంట దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసింది. రూ.113 కోట్లు విడుదల చేస్తూ విపత్తుల ..
![ఇన్పుట్ సబ్సిడీ విడుదల](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ఇటీవలి వర్షాల వల్ల పంట దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసింది. రూ.113 కోట్లు విడుదల చేస్తూ విపత్తుల నిర్వహణ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 8,443 హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్లు, 14,005 మంది రైతులు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీంతోపాటు ఉద్యాన పంటల్లో నష్టపోయిన రైతులకు మరో రూ.22 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదలకు పరిపాలనా అనుమతులిస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది.