మండిన రాయలసీమ
ABN , First Publish Date - 2020-03-18T10:01:06+05:30 IST
రాయలసీమలో మంగళవారం ఎండ మండిపోయింది. అనంతపురంలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేసవి సీజన్లో దేశంలో 40 డిగ్రీలు నమోదుకావడం ఇదే తొలిసారి. కర్నూలులో 38.6, తిరుపతిలో
విశాఖపట్నం, మార్చి 17(ఆంధ్రజ్యోతి): రాయలసీమలో మంగళవారం ఎండ మండిపోయింది. అనంతపురంలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేసవి సీజన్లో దేశంలో 40 డిగ్రీలు నమోదుకావడం ఇదే తొలిసారి. కర్నూలులో 38.6, తిరుపతిలో 37.7 డిగ్రీలు నమోదైంది. ద్రోణి ప్రభావం, ఎండ తీవ్రతతో ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24గంటల్లో ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, దక్షిణకోస్తా, రాయలసీమల్లో పొడివాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.