బడ్జెట్ స్కూల్స్‌ను ఆదుకోవాలంటూ సీఎంకు రామకృష్ణ లేఖ

ABN , First Publish Date - 2020-06-16T13:23:59+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ప్రైవేటు విద్యా సంస్థలకు అమ్మఒడితో పాటు బడ్జెట్ స్కూల్స్‌కు కూడా ప్రభుత్వం

బడ్జెట్ స్కూల్స్‌ను ఆదుకోవాలంటూ సీఎంకు రామకృష్ణ లేఖ

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ప్రైవేటు విద్యా సంస్థలకు అమ్మఒడితో పాటు బడ్జెట్ స్కూల్స్‌కు కూడా ప్రభుత్వం అందించే పథకాలను వర్తింపజేయాలని కోరారు. పట్టభద్రులైన నిరుద్యోగులు తమ జీవనానికై ఏర్పాటు చేసుకున్న చిన్న విద్యా సంస్థలే బడ్జెట్ స్కూల్స్‌ని వివరించారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడే పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. ఈ ఏడాది 40% బడ్జెట్ స్కూల్స్ ప్రభుత్వ గుర్తింపును రెన్యువల్ చేసుకోవాల్సి ఉందని వెల్లడించారు. ప్రస్తుత లాక్‌డౌన్ కారణంగా ఆరు నెలల పాటు రెన్యువల్ గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రైవేట్ స్కూల్స్‌కు వడ్డీలేని రుణ సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని లేఖలో రామకృష్ణ కోరారు.

Updated Date - 2020-06-16T13:23:59+05:30 IST