టీడీపీ నేతల అరెస్టులను ఖండించిన రామకృష్ణ
ABN , First Publish Date - 2020-06-25T21:05:36+05:30 IST
హైదరాబాద్: రాష్ట్రంలో తెలుగుదేశం నాయకుల అరెస్టులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు.
![టీడీపీ నేతల అరెస్టులను ఖండించిన రామకృష్ణ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్: రాష్ట్రంలో తెలుగుదేశం నాయకుల అరెస్టులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. హైకోర్టు నిర్ణయాన్ని ధిక్కరించి అచ్చెన్నాయుడుపై అమానవీయంగా ప్రవర్తించడం సరికాదన్నారు. కరోనా విపత్తు దృష్ట్యా రాష్ట్రంలో డిగ్రీ, పీజీ పరీక్షలతో సహా అన్ని పరీక్షలను వాయిదా వేయాలన్నారు. నూతన జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు. జిల్లాల ఏర్పాటులో అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నామని రామకృష్ణ తెలిపారు.