రాజమండ్రిలో రెచ్చిపోయిన వడ్డీ వ్యాపారులు
ABN , First Publish Date - 2020-06-25T16:28:17+05:30 IST
రాజమండ్రిలో రెచ్చిపోయిన వడ్డీ వ్యాపారులు
![రాజమండ్రిలో రెచ్చిపోయిన వడ్డీ వ్యాపారులు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరిపోడులో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోయారు. అప్పు తీర్చలేదంటూ మోహన్ వంశీని అనే వ్యక్తిని వడ్డీ వ్యాపారులు కిడ్నాప్ చేశారు. ఆపై జీడిపప్పు ఫ్యాక్టరీలో బంధించి తీవ్రంగా చిత్ర హింసలకు గురి చేశారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు మల్కిపురం పోలీసులు కేసు నమోదు చేసి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.