రాజమండ్రి రూరల్లో కరోనా జోరు
ABN , First Publish Date - 2020-07-12T02:02:51+05:30 IST
జిల్లాపై కొవిడ్ దాడి కొనసాగుతోంది. ఎక్కడికక్కడ పదుల సంఖ్యలో కేసులు నిర్ధారణ అవుతూనే ఉన్నాయి. రాజమండ్రి రూరల్లో పాజిటివ్ల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు
రాజమండ్రి: జిల్లాపై కొవిడ్ దాడి కొనసాగుతోంది. ఎక్కడికక్కడ పదుల సంఖ్యలో కేసులు నిర్ధారణ అవుతూనే ఉన్నాయి. రాజమండ్రి రూరల్లో పాజిటివ్ల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు వీటి సంఖ్య పెరిగిపోతూ ప్రజలను కలవరపెడుతోంది. శనివారం రాజమండ్రి రూరల్లో 52 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రూరల్లో 254 మంది కరోనా సోకింది. 98 కట్టడి ప్రాంతాలను అధికారుల గుర్తించారు. అంతేకాకుండా ఈ రోజు రాజమండ్రి అర్బన్లో కూడా 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నగరంలో ఇప్పటివరకు 321 మందికి కరోనా సోకింది. కరోనా రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో 62 కట్టడి ప్రాంతాలుగా అధికారులు ప్రకటించారు. మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్కు కరోనా సోకింది. దీంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు. అంబాజీపేట నందంపూడిలో 104 వాహనం డ్రైవర్కు కరోనా పాజిటివ్ నిర్ధారించారు. అంబాజీపేట మండలం మొసలపల్లిలో నాలుగు నెలల బేబీకి కరోనా సోకింది. పెద్ద ఎత్తున విస్తరిస్తున్న వైరస్ మహమ్మారికి కట్టడి ఎప్పుడనేది అంతపట్టక ప్రజలంతా బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు.