18.50అడుగులకు పెరిగిన ధవళేశ్వరం బ్యారేజీ నీటిమట్టం
ABN , First Publish Date - 2020-08-22T17:55:10+05:30 IST
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది.
రాజమండ్రి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 18.50 అడుగులకు పెరిగింది. అధికారులు 175 గేట్లు పూర్తిగాఎత్తివేసి... 20.27 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.