మాజీ ఎమ్మెల్యే యెర్నేని రాజబాబు మృతి
ABN , First Publish Date - 2020-05-18T09:38:11+05:30 IST
కృష్ణాజిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే యెర్నేని రాజా రామచందర్
కైకలూరు, మే 17: కృష్ణాజిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే యెర్నేని రాజా రామచందర్(రాజబాబు)(78) ఆదివారం తన స్వగ్రామమైన కలిదిండి మండలం కొండూరు గ్రామంలో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కైకలూరు నియోజకవర్గంలో 3సార్లు ఎమ్మెల్యేగా, ఆరేళ్లు సమితి ప్రెసిడెంట్గా, ఒకసారి మార్కెట్యార్డు చైర్మన్గా ఉన్నారు.