పెరిగిన ఎండలు
ABN , First Publish Date - 2020-03-12T09:33:34+05:30 IST
ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు లేకపోవడంతో రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది. దీంతో ఎండ తీవ్రత పెరిగింది. నైరుతి గాలులు
విశాఖపట్నం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు లేకపోవడంతో రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది. దీంతో ఎండ తీవ్రత పెరిగింది. నైరుతి గాలులు వీస్తుండడంతో పలుచోట్ల మధ్యాహ్న సమయంలో వేడి వాతావరణం నెలకొంది. బుధవారం దేశంలోనే అత్యధికంగా అనంతపురం, కర్నూలులో 37.3 డిగ్రీలు నమోదైంది. రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమలో పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఎండ తీవ్రతకు ఎక్కడైనా స్థానిక పరిస్థితుల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారి తెలిపారు.