మళ్లీ పుట్టిన గాంధీ అంటూ రఘురామ సెటైర్లు
ABN , First Publish Date - 2020-10-03T20:43:34+05:30 IST
సీనియర్ పొలిటిషియన్, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి రాసిన ‘గాంధీజీ మళ్లీ పుట్టాడు’ వ్యాసంపై నర్సాపురం ఎంపీ రఘురామరాజు స్పందించారు. రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ...
న్యూఢిల్లీ: సీనియర్ పొలిటిషియన్, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి రాసిన ‘గాంధీజీ మళ్లీ పుట్టాడు’ వ్యాసంపై నర్సాపురం ఎంపీ రఘురామరాజు స్పందించారు. రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ... ‘‘చల్లా రామకృష్ణా రెడ్డిని గతంలో కలవలేదు. జంధ్యాల దర్శకత్వంలో రామకృష్ణా రెడ్డి నటిస్తూ, నిర్మించిన సత్యాగ్రహం చూశాను. సినిమాలపై చిన్నప్పటి నుంచి ఉన్న ఆసక్తితో ఆ సినిమాకు వెళ్లాను. చల్లా రాసిన వ్యాసం ‘గాంధీజీ మళ్లీ పుట్టాడు’ ఓ పత్రికలో ప్రచురితమైంది. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమే... దాన్ని ఎవరూ కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే మళ్లీ పుట్టిన గాంధీ గారికి ఓ విన్నపం. గత జన్మలో మీరున్నప్పుడు అహింసను ఏ విధంగా పాటించారో.. సత్యాగ్రహంతో ఎలా ముందుకు వెళ్లారో.. ఇప్పుడు ఆ సిద్ధాంతాలనే ఫాలో అవుతూ ... అమరావతి రైతులు న్యాయ పోరాటం చేస్తున్నారు. వారితో ఎందుకు మాట్లాడటం లేదు. వారిపై తీవ్రమైన చర్యలు ఎందుకో తీసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు’’ అని అన్నారు.