ప్రధాని మోదీకి లేఖ రాసిన ఎంపీ రాఘురామ
ABN , First Publish Date - 2020-12-30T19:54:31+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎంపీ రాఘురామ కృష్ణమరాజు లేఖ రాశారు.
![ప్రధాని మోదీకి లేఖ రాసిన ఎంపీ రాఘురామ](https://media.andhrajyothy.com/appimg/galleries/202012300218068/12302020142406n38.jpg)
తూ.గో.జిల్లా: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎంపీ రాఘురామ కృష్ణమరాజు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో 18 నెలల నుంచి హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయన్నారు. ఇప్పటి వరకు వంద ఆలయాలపై దాడులు చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో దుండగులు శ్రీరాముని విగ్రహం ధ్వంసం చేసి.. తలనరికి ఎత్తుకుపోయారని తెలిపారు. హిందూ ఆలయాలపై దాడుల విషయంలో...కేంద్రం కమిటీని నియమించాలని రఘురామ కృష్ణమరాజు ఆ లేఖలో పేర్కొన్నారు.