సీఎం జగన్పై రఘురామకృష్ణంరాజు సెటైర్లు
ABN , First Publish Date - 2020-12-26T01:23:52+05:30 IST
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణంరాజు సెటైర్లు వేశారు. ఇళ్ల కాలనీలకు సీఎం జగన్ పేరు పెట్టడంపై ఆయన విమర్శలు చేశారు. పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో..
![సీఎం జగన్పై రఘురామకృష్ణంరాజు సెటైర్లు](https://media.andhrajyothy.com/appimg/galleries/202012250750008/12252020195307n81.jpg)
ఏలూరు: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణంరాజు సెటైర్లు వేశారు. ఇళ్ల కాలనీలకు సీఎం జగన్ పేరు పెట్టడంపై ఆయన విమర్శలు చేశారు. పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో గృహ నిర్మాణం జరగడం అంతసులభం కాదన్నారు. రాష్ట్రం అప్పుల పరిమితి దాటిపోయిందన్నారు. జగన్కు తప్పుడు సలహాలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. అన్ని పథకాలకు జగన్ పేరేనా అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.