1334 మంది ఉండేలా క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు

ABN , First Publish Date - 2020-03-27T18:06:25+05:30 IST

రాజమండ్రి: 1,334 మందిని క్వారంటైన్ సెంటర్లలో ఉంచేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.

1334 మంది ఉండేలా క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు

రాజమండ్రి: 1,334 మందిని క్వారంటైన్ సెంటర్లలో ఉంచేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, అన్నవరం, దిండి, కాకినాడ, రంపచోడవరంలో క్వారంటైన్ సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 3,442 మందిని అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు జిల్లాలో కరోనా అనుమానితులు 57 మంది ఉన్నారు. కరోనా సోకిన 22 ఏళ్ల రాజమండ్రి యువకుడికి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్సను అందిస్తున్నారు. లాక్‌డౌన్‌లో నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. 

Updated Date - 2020-03-27T18:06:25+05:30 IST