కరోనా రోగులకు ప్రత్యేక గదులు

ABN , First Publish Date - 2020-03-25T09:16:50+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా తూర్పు గోదావరిజిల్లాలో అధికారులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలో అత్యధిక శాతం...

కరోనా రోగులకు ప్రత్యేక గదులు

  • ‘తూర్పు’లో నెగెటివ్‌ ప్రెజర్‌ రూమ్‌ల ఏర్పాటు


కాకినాడ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా తూర్పు గోదావరిజిల్లాలో అధికారులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలో అత్యధిక శాతం మంది ఈ జిల్లాలోనే ఉండడంతో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


అందులో భాగంగా కరోనా సోకిన రోగి శ్వాస ద్వారా వదిలే గాలి నేరుగా బయటకు వెళ్లి వైరస్‌ విస్తరించకుండా ఉండేందుకు కాకినాడ జీజీహెచ్‌లో అధునాతన వసతులతో కూడిన నెగెటివ్‌ ప్రెజర్‌ ఐసోలేషన్‌ రూములను సిద్ధం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఈ గదులు అందుబాటులోకి రానున్నాయి. రూ.1.30 కోట్ల వ్యయంతో నిర్మించే ఎనిమిది గదుల్లో ఒక్కో రోగిని ఉంచి చికిత్స అందిస్తారు. ఈ నెగెటివ్‌ ప్రెజర్‌ ఐసోలేషన్‌ గదుల్లో ఆదునిక టెక్నాలజీతో తయారుచేసిన హెపా ఫిల్టర్లు అమర్చుతారు. ఇవి కరోనా రోగి తన శ్వాస ద్వారా వదిలిన గాలిని అక్కడికక్కడే శుద్ధి చేస్తాయి. రోగి వదిలిన వైర్‌సను పూర్తిగా నిర్మూలిస్తాయి. ఆ తర్వాత వైరస్‌ రహిత స్వచ్ఛమైన గాలిగా మార్చి ఈ ఫిల్టర్ల ద్వారా బయటకు వదులుతాయి.

Updated Date - 2020-03-25T09:16:50+05:30 IST