క్యారంటైన్లో వసతులు పెంచాం: కృష్ణబాబు
ABN , First Publish Date - 2020-07-11T00:13:36+05:30 IST
పెరుగుతున్న కోరనా కేసులకు అనుగుణంగా క్యారంటైన్లో వసతులు పెంచామని రాష్ట్ర కోవిడ్ కంట్రోల్ రూమ్ నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు తెలిపారు.

అమరావతి: పెరుగుతున్న కోరనా కేసులకు అనుగుణంగా క్యారంటైన్లో వసతులు పెంచామని రాష్ట్ర కోవిడ్ కంట్రోల్ రూమ్ నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు తెలిపారు. దీనికి సంబంధించి సీఎం జగన్ అనేక సూచనలు చేశారని తెలిపారు. కరోనా సోకిన రోగులకు లక్షణాలు తక్కువగా ఉంటే కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉంచుతున్నామని చెప్పారు. కోవిడ్ ఆసుపత్రికి 15 నిమిషాల్లో చేరుకునే విదంగా కోవిడ్ సెంటర్లను సిద్ధం చేశామని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో 3000 వేల బెడ్స్ ఉన్నామని వాటిని 5000వేలకు పెంచుతున్నాని ఆయన ప్రకటించారు. ప్రతి జిల్లాకు కోటి రూపాయలు మంజూరు చేశామని, ఎక్స్రే, టాయిలెట్స్ నిర్మాణాల కోసం ఆ నిధులను వినియోగిస్తామని తెలిపారు. కరోనా రోగి భోజనం కోసం 500 రూపాయలు ఖర్చు చేస్తున్నామని కృష్ణబాబు తెలిపారు.