జగనన్న పాలనలో ప్రజా రోడ్డు చూశారా!

ABN , First Publish Date - 2020-12-11T23:18:54+05:30 IST

వాళ్ల కాలనీలకి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా..

జగనన్న పాలనలో ప్రజా రోడ్డు చూశారా!

కడప: వాళ్ల కాలనీలకి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనికరించలేదు. విసిగిపోయిన స్థానికులు వాళ్లే రోడ్డు వేసుకుంటున్నారు. జగన్ ఇలాఖా కడపలోని పరిస్థితి ఇది. కడప 15వ డివిజన్ సాగర్ కాలనీలో ప్రధాన రహదారి నిర్మాణం కోసం నేతలు అధికారులకు ఎన్నో వినతులు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా తమకు రోడ్డు కష్టాలు తీరలేదు. దీంతో ఎవర్ని నమ్ముకున్నా లాభం లేదనుకుని కాలనీ వాసులు చందాలు వేసుకుని రోడ్డు వేసుకుంటున్నారు. సీఎం సొంత జిల్లాలోని ప్రజల కష్టాలు పట్టించుకునే వారు లేరని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-12-11T23:18:54+05:30 IST