పొలాల్లో దిగిన ప్రైవేట్ హెలికాప్టర్
ABN , First Publish Date - 2020-10-19T07:13:49+05:30 IST
పొగమంచు కారణంగా ఓ ప్రైవేట్ హెలికాప్టర్ను పొలాల్లో అత్యవసరంగా దించాల్సి వచ్చింది. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన

చెన్నై (ఆంధ్రజ్యోతి)/ కుప్పం, అక్టోబరు 18: పొగమంచు కారణంగా ఓ ప్రైవేట్ హెలికాప్టర్ను పొలాల్లో అత్యవసరంగా దించాల్సి వచ్చింది. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఎస్.వి.ఎన్. జ్యువలరీ దుకాణం అధినేత శ్రీనివాసన్ తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆదివారం ఉదయం హెలికాప్టర్లో బయల్దేరారు.
పొగమంచు దట్టంగా కమ్ముకుని ప్రతికూల వాతావరణం ఏర్పడడంతో పైలెట్ హెలికాప్టర్ను కుప్పం సమీపంలోని తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు జిల్లా నంగిలి గ్రామ పొలాల్లో అత్యవసర ల్యాండింగ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పైలట్ సమయస్ఫూర్తితో చాపర్లో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.