ప్రకాశం..తీర ప్రాంత గ్రామాల్లో కొనసాగుతున్న పోలీస్ పికెట్
ABN , First Publish Date - 2020-12-17T13:54:05+05:30 IST
ప్రకాశం..తీర ప్రాంత గ్రామాల్లో కొనసాగుతున్న పోలీస్ పికెట్

ప్రకాశం: తీర ప్రాంత గ్రామాల్లో పోలీస్ పికెట్ కొనసాగుతుంది. చీరాల వాడరేవుకు చెందిన ఆరుగురు మత్స్యకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వాడరేవు గ్రామంపై దాడి చేసిన ఘటనలో 16 మంది కఠారివారిపాలెం మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. బల్లవల విషయంలో ఏకాభిప్రాయం రానందున గొడవ తలెత్తింది. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఐలవల మత్స్యకారులు పాంప్లెట్స్ విడుదల చేశారు. బల్లవల నిషేధించేవరకు ఆందోళన కొనసాగిస్తామని ఐలవల మత్స్యకారులు స్పష్టం చేశారు.