ప్రకాశం జిల్లాలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-09-24T12:24:36+05:30 IST

ప్రకాశం జిల్లాలో రెండు రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.

ప్రకాశం జిల్లాలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో రెండు రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 218 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44,305కి చేరింది. ఒంగోలులో అత్యధికంగా 33 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ముగ్గురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో  435 మంది మృతి చెందారు. నిన్న కరోనా నుండి కోలుకుని 64 మంది డిశ్చార్జ్ అయ్యారు. 32 మందిని హోం ఐసోలేషన్‌కు పంపారు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 10,482 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

Updated Date - 2020-09-24T12:24:36+05:30 IST