ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా కేసుల ఉధృతి

ABN , First Publish Date - 2020-08-20T12:30:56+05:30 IST

ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 455 కేసులు నమోదు అయ్యాయి.

ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా కేసుల ఉధృతి

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 455 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 14,900కు చేరింది. ఒంగోలులో అత్యధికంగా 127 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి అత్యధికంగా తొమ్మిది మంది మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 197కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 2,18,001 శ్యాంపిళ్లు పంపగా...అందులో 2,00,752 నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఇంకా 2549 రిపోర్టులు రావాల్సి ఉంది. నిన్న కరోనా నుండి కోలుకుని 89 మంది డిశ్చార్జ్ అయ్యారు. 69 మందిని హోం ఐసోలేషన్‌కు పంపించారు. జిల్లాలో ప్రస్తుతం 1741 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

Updated Date - 2020-08-20T12:30:56+05:30 IST