సీఎం నివాసంలో కరెంటు పోయింది
ABN , First Publish Date - 2020-09-23T10:10:21+05:30 IST
సీఎం నివాసంలో కరెంటు పోయింది
న్యూఢిల్లీ, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలో సీఎం అధికార నివాసం 1-జన్పథ్కు మంగళవారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రాత్రి 10.30 గంటల సమయంలో ఆయన తన బసను ఏపీ భవన్లోని గవర్నర్ కాటేజీకి మార్చాల్సి వచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిసిన అనంతరం ఆయన 1-జనపథ్లోని తన అధికార నివాసానికి వచ్చారు. సాంకేతిక లోపంతో విద్యుత్ సరఫరా ఆగిపోయినట్లు చెబుతున్నారు.