‘విద్యా కానుక’ మళ్లీ వాయిదా ?
ABN , First Publish Date - 2020-09-03T08:43:19+05:30 IST
ప్రభుత్వ స్కూలు పిల్లలకు యూనిఫాం క్లాత్, బూట్లు, బుక్స్ అందించే ‘జగనన్న విద్యా కానుక’ మరోసారి

అమరావతి- ఆంధ్రజ్యోతి: ప్రభుత్వ స్కూలు పిల్లలకు యూనిఫాం క్లాత్, బూట్లు, బుక్స్ అందించే ‘జగనన్న విద్యా కానుక’ మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. ఈ నెల ఐదున ప్రభుత్వ రంగ పాఠశాలల పిల్లలకు రూ.660 కోట్ల వ్యయం కాగల విద్యా కానుక కిట్లను పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ కిట్లను 1 నుంచి 10వ తరగతి పిల్లలకు పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం. పాఠశాలలు పున:ప్రారంభమయ్యే రోజున పెద్ద ఎత్తున వి ద్యార్థులు, తల్లిదండ్రుల సమక్షంలో ఈ కార్యక్రమం చేపట్టాలని తలపోసింది. ఆగస్టు 3న పంపిణీ చేయాలనినుకున్నా.. వాయిదాపడింది. దీంతోణ ఈనెల ఐదున పంపిణీ చేయాలని మరోసారి నిర్ణయించారు.
అయితే, కేంద్రం అన్లాక్ 4.0 ఉత్తర్వుల నేపథ్యంలో ఆ రోజున స్కూళ్లు తెరుచుకొనే వాతావరణం కనిపించడం లేదు. ఈ కారణంగా ఈసారీ కార్యక్రమం వాయిదాపడినట్టేనని తెలుస్తోంది.