రాజకీయాలు వీడి సాయం చేయండి: శైలజానాథ్
ABN , First Publish Date - 2020-04-05T09:13:21+05:30 IST
చప్పట్లు కొడదాం, దీపాలు వెలిగిద్దామంటూ రాజకీయాలు చేయకుండా.. వైద్యులకు రక్షణ పరికరాలు.. పేదలకు సాయమందించేందుకు వీలుగా రూ.25000 కోట్ల ప్యాకేజీని తక్షణమే ప్రకటించాలని

అమరావతి, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): చప్పట్లు కొడదాం, దీపాలు వెలిగిద్దామంటూ రాజకీయాలు చేయకుండా.. వైద్యులకు రక్షణ పరికరాలు.. పేదలకు సాయమందించేందుకు వీలుగా రూ.25000 కోట్ల ప్యాకేజీని తక్షణమే ప్రకటించాలని ప్రధాని నరేంద్రమోదీని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి శనివారం లేఖ రాశాను. దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రాలకు చేయూత అందించేందుకు తక్షణమే రూ.25000 కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశానికి ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నిధులు రూ.7500 కోట్లతో పాటు.. ప్రధాని సహాయ నిధికి వస్తోన్న విరాళాలను కలిపి రాష్ట్రాలకు తక్షణమే ప్యాకేజీని ప్రకటించాలని లేఖలో ప్రధానిని శైలజానాథ్ కోరారు.