కలకలం.. 8 ట్రంకు పెట్టెల్లో బంగారం, వెండి, నగదు, రివాల్వర్
ABN , First Publish Date - 2020-08-19T04:20:07+05:30 IST
జిల్లాలో బంగారం, వెండి, ఆయుధాల కలకలం రేగింది. బుక్కరాయసముద్రంలోని..
![కలకలం.. 8 ట్రంకు పెట్టెల్లో బంగారం, వెండి, నగదు, రివాల్వర్](https://media.andhrajyothy.com/appimg/galleries/2020081810474374/08182020225002n7.jpg)
అనంతపురం: జిల్లాలో బంగారం, వెండి, ఆయుధాల కలకలం రేగింది. బుక్కరాయసముద్రంలోని ఎస్సీ కాలనీలో బాలప్ప అనే వ్యక్తి ఇంట్లో ముగ్గురు డీఎస్పీలతో పాటు భారీ ఫోర్సుతో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 8 ట్రంకు పెట్టెల్లో బంగారం వెండి, నగదు, రివాల్వర్ను గుర్తించారు. బాలప్పను విచారించగా ట్రెజరరీ ఉద్యోగి మనోజ్విగా తేలింది. ఈ బంగారం, వెండిని మనోజ్ డ్రైవర్ నాగలింగ తన మామ బాలప్ప ఇంట్లో ఉంచినట్లు పోలీసులు వెల్లడించారు.