కోడిపందేల స్థావరాలపై పోలీసుల దాడి.. 20 మంది అరెస్ట్

ABN , First Publish Date - 2020-04-08T16:18:59+05:30 IST

ప్రకాశం: కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించినా జనం పెద్దగా పట్టించుకోవడం లేదు.

కోడిపందేల స్థావరాలపై పోలీసుల దాడి.. 20 మంది అరెస్ట్

ప్రకాశం: కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించినా జనం పెద్దగా పట్టించుకోవడం లేదు. మరోవైపు గుంపులుగా చేరవద్దని చెబుతున్నా పెడిచెవిన పెడుతున్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరులో ఏకంగా కోడిపందేలు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కోడిపందేల స్థావరంపై దాడి చేసి.. 20 మందిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రూ.57,680 నగదు, 67 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Updated Date - 2020-04-08T16:18:59+05:30 IST